Thursday, April 25, 2024

మర్రిగూడలో బిజెపికి ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మండల బిజెపి అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్యలు వారి వారి అనుచరులతో గులాబీ గూటికి చేరారు. వారితో పాటే నాంపల్లి మండలం మహమ్మాదాపురం ఎంపిటిసి మంజుల, గట్టుప్పల్ ఎంపిటిసి చెరుపల్లి భాస్కర్ తదితరులు టిఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, చందం పేట మాజీ ఎంపిపి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై పెరిగిన విశ్వసనీయతకు చేరికలు నిదర్శనమన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత కు తాజా చేరికలు అద్దం పడుతున్నాయాన్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. అనంతరం శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసే టిఆర్ఎస్ లోకి వలసల ప్రవాహం కొనసాగుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News