Saturday, May 4, 2024

ఉప్పల్ క్రికెట్ స్టేడియం… బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలో బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుగులోత్ వెంకటేష్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురు వ్యక్తులు బ్లాక్ లు టికెట్లు అమ్ముతుండగా ఎల్బీనగర్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. 850 రూపాయల టిక్కెట్ ధరను 11 వేల రూపాయలకు అమ్ముతుండగా ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నుంచి ఆరు టిక్కెట్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News