Monday, April 29, 2024

బాలీవుడ్ నటి గాయత్రి జోషి కారు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ మూవీ ‘స్వదేశ్లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన నటి గాయత్రీ జోషి.. ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారులో ప్రమాదానికి గురైంది. ఆమె భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో సెలవుల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సార్డినియా సూపర్‌కార్ ఎక్స్‌పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రమాదం జరగగానే గాయత్రి ప్రయాణిస్తున్న లాంబోర్గినీ కారు మరో లగ్జరీ కారు, ఫెరారీ, క్యాంపర్ వ్యాన్‌లను ఢీకొట్టింది. లంబోర్ఘిని, ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు మినీ ట్రక్ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విస్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మీడియా కథనాల ప్రకారం, ఫెరారీకి మంటలు అంటుకోవడంతో మెలిస్సా క్రౌట్లీ (63), మార్కస్ క్రౌట్లీ (67) అక్కడికక్కడే మరణించారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం, గాయత్రి, వికాస్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. సినిమాల విషయానికి వస్తే, ఆమె 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘స్వదేస్’ చిత్రంలో నటించింది. ఆమె 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ని వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ ప్రమాదం నుంచి ఆమె తప్పించుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News