Friday, April 26, 2024

మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

- Advertisement -
- Advertisement -

 

బోథ్: హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి బజార్‌హత్నూర్ మండలంలోని కొల్హారి, మోర్ఖండి బ్రిడ్జిలు మంజూరు చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు. అనంతరం కుంటాల వాటర్ ఫాల్‌కి వెళ్లే దారిలో బ్రిడ్జి, రాంపూర్ నుండి భీంపూర్ మండలకేంద్రానికి బిటి రోడ్డు మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే మంత్రిని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. వీరి వెంట తాంసి ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లస్మన్న, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News