మనతెలంగాణ, హైదరాబాద్ : వివాహం జరిగి నాలుగు రోజులు కూడా గడవకముందే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలోని జగద్గిరిగుట్టలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట ఇన్స్స్పెక్టర్ పోలె సైదులు కథనం ప్రకారం… ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా, కట్రేనకోనా మండలం, బొట్టుచెరువు గ్రామానికి చెందిన సాకస్వామి కుటుంబం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలోని ప్రగతి నగర్ ఎస్వీర్ హైస్కూల సమీపంలో ఉంటున్నారు. మెస్త్రీ పనిచేస్తున్న సామికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారెర్త సౌజన్య(24)కు ఈ నెల 6వ తేదీన వెంకటేశ్వరరావుకు ఇచ్చి వారి స్వగ్రామంలో వివాహం జరిపించారు. ఈ నెల 9వ తేదీన వారికి శోభనం ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరరావు 10 తేదీ ఉదయం గది నుంచి బయటికి వచ్చి మీ అమ్మాయి సౌజన్య రాత్రి నామాట వినలేదు, ఈ విషయం పెద్దలతో చర్చిద్దాం అని అత్తతో చెప్పాడు. కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో హాల్లో ఉండగా సౌజన్య ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సౌజన్యను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్స్పెక్టర్ సైదులు తెలిపారు.