Saturday, April 20, 2024

కొన్ని గంటల్లో పెండ్లి… నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యగల్ల ప్రభాకర్ గుప్తా కూతురు రవళి (26) రెండు నెలల క్రితం నిజామాబాద్ నగరానికి చెందిన సంతోష్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగితో నిశ్శితార్థం జరిగింది. వివాహం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్‌లోని జనార్ధన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేయగా, ఇంతలోనే ఆ నవ వధువుకు ఏ ఆపద వచ్చిందో ఏమో కానీ పెళ్లి కూతురుగా ముస్తాబైన తరుణంలో ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఉద్యోగం చేయాలని వరుడు ఫోన్లో వేధించడం వల్లే తమ కూతురు తనువు చాలించిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఘటన స్థలానికి ఎస్సై రాజారెడ్డి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News