Thursday, April 25, 2024

ఐటిఐ మైదానంలో గుర్తు తెలియని మృతదేహం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. ఆదివారం ఐటిఐ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురికి తరలించామన్నారు. మృతుడుని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News