Tuesday, March 19, 2024

బ్రిజ్ భూషణ్‌కు యోగి సర్కార్ షాక్!

- Advertisement -
- Advertisement -

లక్నో : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌కు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ అనూహ్యంగా వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. కాగా, వాయిదా విషయాన్ని బ్రిజ్‌భూషణ్ ఫేస్‌బుక్ ప్రకటన ద్వారా వెల్లడించారు.

అయితే యూపీ ప్రభుత్వం ఆయన ర్యాలీకి అనుమతి నిరాకరించడం వల్లే వాయిదా పడ్డట్లు తెలిసింది. ‘మీ మద్దతుతో గత 28 సంవత్సరాలుగా చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నాను. నేను అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అని వర్గాలను ఏకం చేసేందుకు నా వంతు కృషి చేశాను. ఆ వర్గాలకు చెందిన లక్షలాదిమంది నాకు మద్దతు తెలుపుతున్నారు. అందుకే నా రాజకీయ ప్రత్యర్థులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

వారు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ వివిధ వర్గాల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే జూన్ 5వ తేదీన సాధువుల ఆశీస్సులతో ’జన చేతన్ మహార్యాలీ’ని నిర్వహించాలనుకున్నాను. అయితే ప్రస్తుతం నాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కొన్ని రోజులపాటు దీనిని వాయిదా వేస్తున్నాను’ అని తన ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News