Monday, May 20, 2024

మాజీ గవర్నర్ తమిళి సై పై ఈసీకి బిఆర్‌ఎస్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మాజీ గవర్నర్ తమిళి సై సౌందరాజన్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను బిఆర్‌ఎస్ కోరింది. ఈసీకి బీఆర్‌ఎస్ పార్టీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కాలనీలో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశారని, ఆ సమయంలో ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని (మోడల్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

ఆమెపై ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చూడాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రామ మందిర నమూనాలను పంపిణీ చేస్తున్న ఫొటోలను కూడా ఈసీకి అందజేసినట్లు తెలిపారు. అలాగే తమిళిసై పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లోనూ బీఆర్‌ఎస్ లీగల్ టీం ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ టీం సభ్యులు లలిత, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ గంగా, సదానందం, కార్తీక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News