Thursday, May 30, 2024

బాచుపల్లి ఘటనపై సిఎం రేవంత్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడు మంది చనిపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుండపోత వర్షం పడటంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పని చేసే కార్మికుల్లో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపారు.

చనిపోయిన వారు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు చెప్పారు.

హరీశ్‌రావు సంతాపం
గోడకూలిన ఘటనలో కూలీల మృతి పట్ల బిఆర్‌ఎస్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. ఉపాధి కోసం వలస వచ్చిన కూలీలు చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News