Thursday, September 18, 2025

యూపీలో వరద నీటిలో ఇరుక్కున్న బస్సు.. 40 మంది సేఫ్

- Advertisement -
- Advertisement -

బిజ్నోర్ ( యుపి ) : ఉత్తర ప్రదేశ్ లోని కొత్వాలీ నది ఉధ్ధృతంగా ప్రవహిస్తుండడంతో యూపీఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఓ రోడ్డు పైకి భారీగా వరద నీరు ఉప్పొంగడంతో ఓ ప్రయాణికుల బస్సు వరదల్లో చిక్కుకు పోయింది. యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు రూపెదిహా నుంచి హరిద్వార్ వెళ్తుండగా, ఈ సంఘటన జరిగింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వరద ప్రవాహం పెరగడంతో బస్సు ముందుకెళ్లలేక పోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. స్థానికులు పోలీస్‌లకు సమాచారం ఇవ్వడంతో పోలీస్‌లు వచ్చి జేసీబీ మిషన్ల సాయంతో ప్రయాణికులను రక్షించారు. తరువాత వరద నుంచి బస్సును బయటకు తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News