Thursday, May 22, 2025

క్లాస్ రూమ్స్ నిర్మాణంలో భారీ స్కామ్.. ఇద్దరు మాజీ మంత్రులపై ఎసిబి కేసు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వ పాలనలో లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోపాటు ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ఢిల్లీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. ఈ స్కామ్ లో ఆప్ నాయకులు, ఢిల్లీ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై అవినీతి నిరోధక శాఖ(ACB) కేసు నమోదు చేసింది.

AAP ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదులు, అనుబంధ భవనాల నిర్మాణంలో దాదాపు రూ. 2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎసిబి పేర్కొంది. మొత్తం ప్రాజెక్ట్‌లో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఎసిబి అధికారులు తెలిపారు. నిర్దేశిత కాలపరిమితిలోపు ఒక్క పని కూడా పూర్తి కాలేదని.. ఈ ప్రాజెక్టులో సరైన విధానాన్ని పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించారని పేర్కొంది. దీంతో భారీగా ఖర్చు పెరగడంతో బడ్జెట్‌ను మరింత పెంచిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News