Friday, March 29, 2024

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తహసీల్దార్ పై కేసు నమోదు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇఐపిఎల్ కన్స్ట్రక్షన్ విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తహసీల్దార్ ఆర్ పి. జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, , ఇఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ వీడియో నెంబర్ 83/2023 కింద కేసు నమోదు అయింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనెంబర్ 181లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం మాజీ తహసీల్దార్ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ , ఇఐపిల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అందజేశారు. ఈ విషయమై దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం సిఐ మధుసూదన్ సెక్షన్ 420, 166 కింద తహసీల్దార్ జ్యోతి సబ్ రిజిస్టర్ ఇఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు తెలంగాణ హైకోర్టు WP37146/2022 ద్వారా విచారణ కూడా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా భూముల విషయమై సాక్షాత్తు తహసీల్దార్ పై కేసు నమోదు కావడం తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. మహేశ్వరం పోలీసులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. భూవాదాలు కోర్టులో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తహసీల్దార్ మహ్మద్ అలీ మాట్లాడారు. నాగారం లోని సర్వే నెంబర్ 181 విషయం తమ దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News