Thursday, September 18, 2025

మంథని కోర్టుకు సిబిఐ బృందం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్‌రావు దంపతుల హత్యకేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచారాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా వామన్‌రావు స్వగ్రామమైన గుంజపడుగు వెళ్లి వివరాలను సేకరించారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులు బెయిల్‌పై ఉన్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్‌రావు ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు, తమ్ముడు చంద్రశేఖర్ నుంచి వివరాలను సీబీఐ అధికారులు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సైతం పరిశీలించారు. సీబీఐ ఎంట్రీతో ఏం జరుగుతుందోనని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.

Also Read: శబరిమలలో బంగారం మాయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News