Saturday, April 20, 2024

జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 1 ప్రతులను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో శనివారం జరిగిన భోగి పండుగ వేడుకల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలతో కలిసి జీవో నెంబర్ 1 ప్రతులను చంద్రబాబు భోగిమంటల్లో తగులబెటారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పనికిరాని వస్తువులన్నింటితో పాటు జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1 కాపీలను తగులబెట్టామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News