హైదరాబాద్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చరితా రెడ్డి మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. నేరేడ్మెట్లో చరితా రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు నివాళులర్పించారు. డిసెంబర్ 27న అమెరికాలోని మిచిగన్లో జరిగిన కారు ప్రమాదంలో చరితా రెడ్డి బ్రెయిన డెడ్ కావడంతో ఆమె అవయవాలను తొమ్మిది మందికి కుటుంబ సభ్యులకు దానం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికి బ్రెయిన్డెడ్ అయినట్లు ముస్కేగాన్ హాస్పటల్ డాక్టర్లు వెల్లడించారు. మిచిగన్లోని లాన్సింగ్లో 25 ఏళ్ల చరితా రెడ్డి నివాసం ఉంటోంది. కారు ప్రమాద ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న చరితారెడ్డి టయోటా కామ్రీ కారులో ప్రయాణిస్తున్నది. అయితే వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో చరితారెడ్డి కోమాలోకి వెళ్లిపోయింది. క్రిస్లర్ అనే వ్యక్తి మద్యం సేవించి కారు నడుపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
Charitha Reddy’s Dead body Reached to Hyderabad, Charitha reddy died in car accident in america, she brain dead, Nine organs are donated