Monday, April 29, 2024

ఎక్స్‌ప్రెస్‌వేపై కోళ్లను ఎత్తుకుపోయిన జనం (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా యూపీలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. దీంతో ఎక్స్‌ప్రెస్‌వేపై గందరగోళం నెలకోంది. జనాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనం నుంచి కోళ్లను పట్టుకుని పారిపోయారు. కొందరైతే కోళ్లను మూటలలో కట్టుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాహనంలో 1.5 లక్షల విలువైన కోళ్లు ఉండేనని వాహన డ్రైవర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News