ఎపిలోని నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం లో ఇంట్లో ఉన్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కారులో ప్రయా ణిస్తున్న వారు నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసన్ సెకండియర్ చదువుతున్న ఆరుగురు వైద్య విద్యార్థులు.
వారు బుచ్చిరెడ్డిపాలెం వద్ద స్నేహి తుడి అక్క నిశ్చితార్థ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగా త్రులను చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐదుగురు విద్యార్థులు అభిషేక్ రాజ్(అనంతపు రం జిల్లా), జీవన్ చంద్రారెడ్డి (నెల్లూరు), యజ్ఞేశ్ (ప్రకాశం), నరేశ్ నాయక్ (అనంతపురం), అభిశశి పురుషోత్తం (తిరుపతి)ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి నవనీత్ శంకర్ (కడప) పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.