Monday, April 29, 2024

3 గంటల కాంగ్రెస్ కు షాక్ ఇవ్వండి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: కరువుతో ఉన్న భువనగిరి లో ఇవ్వాళ అద్భుతమైన పంటలు పండిస్తున్నారని, ఈ జిల్లాకు యాదాద్రి భువనగిరి అని లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. భువనగిరిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తరువాత జిల్లాలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని ప్రశంసించారు. భువనగిరి నియోజకవర్గంలో ఎంఎల్ఎ పైళ్ల శేఖర్ రెడ్డి అద్భుతంగా అభివృద్ధి చేశారని, మళ్ళీ గెల్చేది శేఖర్ రెడ్డినే అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా నిర్మిస్తున్న బస్వపూర్ రిజర్వాయర్ ద్వారా త్వరలోనే నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ధరణి ద్వారా రైతుల కష్టాలు పోయాయని, అన్నదాతలు సంతోషంగా వ్యవసాయము చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తామంటున్నారని, ధరణి పోతే మళ్ళీ అన్నదాతలు కొట్లాటలు వస్తాయని, అవినీతి వస్తదని, ఫైరవి కారుల కాంగ్రెస్ పార్టీని రానివ్వొద్దని చంద్రశేఖర్ రావు సూచించారు.

కాంగ్రెస్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కరంట్ మాయం అవుతుందని, అప్రమత్తంగా ఉండాలని, 3 గంటలు కరెంట్ ఇస్తాం అంటున్న కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలని ప్రజలకు సూచించారు.  భువనగిరిలో ఐటి హబ్ ఏర్పాటు చేస్తామని, తనకు ఉన్న సర్వే ప్రకారం 50 వేల మెజార్టీతో భువనగిరిలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కెసిఆర్ జోస్యం చెప్పారు. పొన్నాల అనే నాయకుడు తెలంగాణ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ లోకి వచ్చారని, బిఆర్ఎస్ ను మళ్ళీ గెలిపించాలని, బిఆర్ఎస్ పార్టీకి కులం మతం అనే తారతమ్య భేదాలు లేవన్నారు. అందరి బాగు కోసం మ్యానిఫెస్టో విడుదల చేశామని, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని వివరించారు. యాదాద్రిలో భూముల రేట్లు అమాంతం పెరిగాయని, అందరికి సన్న బియ్యం అందిస్తామని, అన్నదాతలకు 24 గంటల కరంట్ వుండాలంటే బిఆర్ఎస్ మూడో సారి ప్రభుత్వం రావాలని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News