Tuesday, April 30, 2024

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

రైతు రుణమాఫిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేస్తామని ఆయన చెప్పారు. సోమవారం నారాయణపేట్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని సిఎం రేవంత్ మాట్లాడారు.
రైతులు అధైర్య పడొద్దు.. ఆగస్టు కల్లా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.

వచ్చే ఏడాది నుంచి రైతులకు ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు మోడీ దగ్గర కెసిఆర్ సుఫారి తీసుకున్నాడని చెప్పారు. 10ఏళ్ల మోడీ పాలనలో పాలమూరు ఎండిపోయిందని మండిపడ్డారు. ఎన్నికల అయిపోయిన తర్వాత నారాయణపేటలో అండర్ గ్రౌండ్ డ్రేనేజిని తీసుకొస్తామ సిఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News