Saturday, July 27, 2024

సింహాన్నే చంపుతా

- Advertisement -
- Advertisement -

ఒక్క బుల్లెట్ చాలు.. కుక్కలను
పిల్లులను చంపను కెసిఆర్‌పై
ప్రతీకారం ఇంకా ప్రారంభమే
కాలేదు ఆప్ కీ అదాలత్
కార్యక్రమంలో సిఎం రేవంత్
సంచలన వ్యాఖ్యలు ప్రోమో
విడుదల చేసిన ఇండియా టీవీ
శనివారం రాత్రి 10గంటలకు
కార్యక్రమం ప్రసారం

మనతెలంగాణ/హైదరాబాద్ : తాను పిల్లులను, కుక్కలను చంపనని, చంపితే సింహాన్నే చంపుతానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండియా టివిలో నిర్వహించే ఫేమ స్ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఢిల్లీ కి వెళ్లిన ఆయన ఈ కార్యక్రమంలో పలు విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సిఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

కెసిఆర్ సర్కారు మిమ్మల్ని జైలులో వేసినందుకు రివేంజ్ తీసుకుంటున్నారా అని ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాంకర్ రజత్ శర్మ అడిగిన  ప్రశ్నకు సిఎం బదులిస్తూ రివేంజ్ ఇంకా స్టార్టే కాలేదని సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ నేతలు తరచూ అంటున్నారు సిం హం లోపల ఉంది, బయటకు వస్తుంది అ ప్పుడు చూడండి అంటున్నారు గా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా, రమ్మనండి పిస్టోల్‌తో రెడీగా ఉన్నాం, ఒక్క తూటాతో అయిపోతుందని సిఎం రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News