Saturday, July 27, 2024

సార్వత్రిక సమరానికి కౌంట్‌డౌన్!

- Advertisement -
- Advertisement -

ఆరు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి
నామినేషన్ల స్వీకరణ..మే 13న పోలింగ్ పోలింగ్‌కు ఒక నెల మాత్రమే
సమయం ఉండటంతో ప్రచారంలో వేగం పెంచిన ప్రధాన పార్టీల
అభ్యర్థులు తమదైన వ్యూహాలతో ఎన్నికలకు సన్నద్ధమైన రాజకీయ పార్టీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించనుండగా తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో భాగంగా ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, ఆ రోజు నుంచి నా మినేషన్లపర్వం ప్రారంభం కానున్నది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొ నసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు ఇసి గడువు ఇచ్చింది. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పో లింగ్ జరగనున్నది.

జూన్ 4న ఎన్నికల కౌం టింగ్ ఉంటుందని ఇసి ఇప్పటికే వెల్లడించిన వి షయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయంలో ఉండటంతో ప్రధాన పా ర్టీల అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. తమదైన వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రచార రథాలను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలు పార్టీ ముఖ్యనాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నా యి. తమ పార్టీపై ఇతర పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా  స్పందిస్తూనే ప్రత్యర్థి పార్టీలపై నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నేతల ఘాటైన వి మర్శలతో ఒక్కసారి రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గ్యారంటీలను కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా, హామీల అమలు లో విఫలమయ్యారంటూ బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కేం ద్రంలో మళ్లీ తమదే అధికారం అనే నమ్మకంతో ఉన్న కమలం నేతలు మరోసారి మోడీ ప్రధాని ఖాయమంటూ వివరిస్తున్నారు.

14 స్థానాలు చేజిక్కించుకునేలా
కాంగ్రెస్ అడుగులు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మొత్తం 17 స్థానాలకు కనీసం 14 స్థానాలైన చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బలమైన నాయకత్వం లేని చోట పార్టీని బలోపేతం చేసే దిశలో ఎఐసిసి అనుమతితో పక్కా కార్యాచరణ అమలు చేస్తోంది. నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహి స్తూ, పార్టీ గెలుపునకు కృషి చేయాలని క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే దిశలో కార్యాచరణకు శ్రీకా రం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షు లు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు నియోజకవర్గాల వారీ గా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోకసభ ఎ న్నికల నియమావళి అమలులోకి రావడంతో పాలనాపరమైన అంశాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా
ముందుకెళుతున్న కమలనాథులు
కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బిజెపి, తెలంగాణలో బిజెపికి సానుకూల వాతావరణం ఉందని భావిస్తూ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్షంగా పార్టీ అగ్రనేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన విమర్శలు చేస్తూ కమలం పార్టీ ముందుకెళుతోంది. బిజెపి పార్టీ టికెట్లు పొందిన అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాలలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. స్థిరమైన పాలన కోసం నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెబుతున్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేసిన మోదీ సర్కార్‌ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రచార కార్యక్రమాల్లో స్పీడ్ పెంచిన కారు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్‌ఎస్ పార్టీ తమ ప్రచార కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుండగా, శనివారం(ఏప్రిల్ 13) జరిగే చేవెళ్ల బహిరంగసభ నుంచి పార్టీ అధినేత కెసిఆర్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు పొందిన లబ్దిదారులు, గ్రామస్థాయి నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని బిఆర్‌ఎస్ అగ్రనాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News