ఆంధ్రప్రదేశ్తో వివాదాలను కోరుకోవడం లేదు అలాగని
మా హక్కులను వదులుకోం 23న జరిగే రాష్ట్ర కేబినెట్లో
బనకచర్లపై చర్చిస్తాం రాష్ట్రాల మధ్య జలవివాదాలకు
చర్చలే పరిష్కారం ఒక్కరోజు కాదు నాలుగు రోజులైనా
కూర్చుందాం ప్రాజెక్టులవారీగా సమస్యలను చర్చిద్దాం
న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం వివాదాల
పరిష్కారంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు కేంద్రానికి
ఎపి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఇవ్వడంతోనే సమస్యలు
పిఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో చర్చించి ఉంటే
సమస్యలు ఉండేవికావు రాజకీయంగా బిఆర్ఎస్
చచ్చిపోయింది పార్టీ పునరుజ్జీవం కోసమే బనకచర్లపై
రాజకీయాలు ఢిల్లీలో మీడియాతో సిఎం రేవంత్ చిట్చాట్
మన తెలంగాణ/హైదరాబాద్:ఎపితో ఎలాంటి వి వాదాలు కోరుకోవడం లేదని, అలాగని ఎవరి కో సమో మా హక్కులను వదులుకోమని చర్చల ద్వా రానే పరిష్కారం లభిస్తుందని తెలంగాణ విశ్వసిస్తుందని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రెండు రా ష్ట్రాల మధ్య విభేదాలు రావద్దనే కాంగ్రెస్ పార్టీ ప్ర త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఆ యన తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 23 వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర కేబినెట్లో బనకచర్ల అంశంపై చర్చిస్తామని ఆ యన పేర్కొన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వంతో చర్చలకు తామే ఒక అడుగు ముందు కు వేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మొదట తెలంగాణకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డా రు.కానీ, ప్రాజెక్టుల అనుమతుల కోసం ఎపి కేం ద్రం వద్దకు వెళుతుందని, కేంద్రం సైతం ఆంధ్రప్రదేశ్ నిర్మించనున్న ప్రాజెక్టులపై సమావేశాలు నిర్వహిస్తుందని,
దాంతో తెలంగాణ ఆందోళన పడాల్సి వస్తుంది -సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం పిఎఫ్ఆర్ ఇవ్వడం వల్లే ఈ వివాదం మొదలయ్యిందని, ఎపి పిఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్ర కూడా స్పందింస్తోందని సిఎం అన్నారు. కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో ఎపి ప్రభుత్వం చర్చించి ఉంటే బాగుండేదని ఆయ న పేర్కొన్నారు. ఢిల్లీలో సిఎం రేవంత్రెడ్డి విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అనవసరమైన వివాదాలను కోరుకోవడం లేదని, కర్ణాటకతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్నట్లే ఎపితోనూ కొనసాగించుకోవాలన్నది మా విధానమని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రం రాకముందు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పటికీ అలాంటి సమస్యలే ఉన్నాయని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ సెంటిమెంట్ను అడ్డంపెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడు గోదావరి జలాల సమస్యను చచ్చిపోయిన బిఆర్ఎస్ సంజీవనిలా వాడుకోవాలని బిఆర్ఎస్ చూస్తుందని ఆయన ఆరోపించారు.
సాగునీటిలో విషయంలో అన్యాయం చేసిందే కెసిఆర్, హరీష్ రావులు
తెలంగాణకు సాగునీటిలో విషయంలో అన్యాయం చేసిందే కెసిఆర్, హరీష్ రావులని, బనకచర్లకు బీజం పడిందే 2016, 2018లోనని అప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వే చేయాలని ఎపి గవర్నమెంట్ జీఓలు ఇచ్చిందని, అప్పుడు తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదని, కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఎపి జిఓల ఆధారంగా వ్యాప్కోస్ 150 పేజీల నివేదిక ఇచ్చిందని సిఎం తెలిపారు. గోదావరి పెన్నా అనుసంధానంలో బనకచర్ల ఒక భాగమని, 86 రోజుల్లో 400 టిఎంసిల గోదావరి వరద జలాలను తరలించేందుకు బనకచర్లకు డిజైన్ చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే పోలవరం నుంచి సోమశిల ద్వారా 86 రోజుల్లో 400 టిఎంసిల వరద నీళ్లను తరలించేలా ఎపి ప్లాన్ చేసిందని ఆయన ఆరోపించారు. గోదావరిలో 968 టిఎంసిల నీటిని వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉందని, అయినా వాడుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని సిఎం అన్నారు. వాడుకునే అవకాశం ఇవ్వకపోవడంతోనే ఈ వివాదం తలెత్తిందని ఆయన అన్నారు. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగానే ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలని నిర్ణయించడం మంచిదన్నారు. ఈ వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్లైన్ లేదని ఆయన తెలిపారు. గోదావరి వరద జలాలను తరలించుకు పోవాలని అఫెక్స్ కౌన్సిల్లో కెసిఆర్ చెప్పారని సిఎం పేర్కొన్నారు.
2023లో తప్పు చేశామని హరీష్రావు ఒప్పుకున్నారు
తెలంగాణ ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే వ్యర్ధ జలాల గురించి తేలుతుందని సిఎం తెలిపారు. ఫిజిబులిటీ రిపోర్టు మీదే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా యాక్ట్ చేస్తుందని ఆయన అన్నారు. 2015, 2020 లో జరిగిన అఫెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణానది జలాలకు సంబంధించి 2009 టిఎంసిలకు ఒప్పుకుంది హరీష్ రావు, కెసిఆర్లేనని ఆయన తెలిపారు. తర్వాత 2023లో తప్పు చేశామని ఒప్పుకొని కృష్ణా నదీజలాల్లో 50 శాతం అంటే 405 టిఎంసిల నీళ్లు ఇవ్వాలని అడిగింది హరీష్ రావు అని ఆయన ఆరోపించారు.
గతంలో హరీష్రావు 45 టిఎంసీల నీళ్లు చాలని లేఖ…..
తాను 500 టిఎంసిలను అడిగితే తప్పుపడుతున్న హరీష్ రావు గతంలో 45 టిఎంసీల నీళ్లు చాలని ఎలా లేఖ రాశారో సమాధానం చెప్పాలని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఇప్పుడు హరీష్రావు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరంతో కొత్తగా 50వేల ఎకరాలకు మాత్రమే ఆయకట్ట లభించిందన్నారు. మొత్తం 2 లక్షల కోట్ల ప్రాజెక్టుకు రూ.1,27,872 కోట్ల టెండర్లకు పిలిచారని, అందులో రూ.96 వేల కోట్లు చెల్లింపులు మాత్రమే చేశారని, ఇంకా ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.50 వేల కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. కమీషన్ల కోసమే పేర్లు మార్చి ఎస్టీమేషన్లు పెంచి ఈ ప్రాజెక్టు కట్టారని సిఎం రేవంత్ ఆరోపించారు.
కెటిఆర్కు కిషన్ రెడ్డి లైజనింగ్ ఆఫీసర్
కిషన్ రెడ్డి ట్యూటర్ కెటిఆర్ అని కెటిఆర్కు కిషన్ రెడ్డి లైజనింగ్ ఆఫీసర్ అని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ చేసిన అవయవదానంతోనే బిజెపి ఎనిమిది సీట్లు గెలిచిందన్నారు. వీరిద్దరి బంధం మరింత బలపడిందని ఆయన ఆరోపించారు. ఈ బంధమే మెదక్లో బిఆర్ఎస్ను ఓడించిందని అయినా బుద్ధి రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిందంటే ఒకటి నిజాం, మరొకటి కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. కెసిఆర్ కట్టింది ఏం లేదని, పోలవరంలో మార్పులకు తెలంగాణ అనుమతి తప్పనిసరని ఆయన అన్నారు.
హరీష్రావు తాటిచెట్టులా పెరిగాడు కానీ, ఆయనకు సరైన నాలెడ్జి లేదని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు అతి తెలివితో, అసహనంతో మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ తెలిపారు. హరీష్ రావు, కెసిఆర్ల అబద్ధాలను చూస్తే దేవుడు కూడా ఆశ్చర్యపోతారన్నారు. తానేనా వీళ్లను సృష్టించిందని ఆశ్చర్యపోయేలా వారి అబద్ధాలు ఉంటాయని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీకి, చంద్రబాబు అవ సరం ఉందని, ఎపిలో టిడిపి మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు వారికి అవసరమని, తెలంగాణలో బిఆర్ఎస్ బ్రతకాలంటే నీళ్ల అంశాన్ని సంజీవనిలా వాడుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు.