Saturday, April 27, 2024

ఊరూరా కంటి పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ఈనెల 18 నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పడుతున్న ఈ కార్యక్రమంలో అందరు ప్ర జాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపి లు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు సహా స్థానిక సంస్థలు, ఇతర ప్రజా ప్ర తినిదులందరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల ని అన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వ హించకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వైద్యారో గ్య శాఖ మంత్రి హ రీశ్ రావు అధ్యక్షతన కంటి వెలుగు సన్నద్ధతపై మంగళవారం బిఆర్‌కె భవన్ లో ఉన్న త స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రి జ్వి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మ హంతి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుండి ఇతర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర ప్రజాప్రతినిధులు, జి ల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రపంచంలోనే నిర్దేశిత కాలంలో పెద్ద సంఖ్యలో కంటి పరీక్షలు నిర్వహించి, మొదటి దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతం చేసిందన్నారు. 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50లక్షల కళ్లద్దాలు ఇవ్వడం అందజేసినట్లు పేర్కొన్నారు.

అదే స్పూర్తితో రెండో దఫా కంటి వెలుగు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల ని ర్వహణ ఉంటుందని వివరించారు. రాష్ట్రం లో అవసరం ఉ న్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలతో పాటు ఉచితం గామందులు, కళ్లద్దాలు అందజేస్తామని తెలిపారు.కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 100 పని దినాలలో పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్‌లు పెంచినట్లు చెప్పారు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుందన్నారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటారని, అందులో ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఎఎన్‌ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో ఉంటారని చెప్పారు.
వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసులు ఉంటాయని వివరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లోపే ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని అన్నారు. సిఎం కెసిఆర్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ కార్యక్రమం అయినా రూపొందిస్తారని చెప్పారు. సిఎం ప్రజల కోణంలో ఆలోచిస్తారని అన్నారు. ప్రభుత్వం పరంగా అన్నీ చేస్తామని, అధికారులు పూర్తి బాధ్యతతో పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. రోజువారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈనెల 12లోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటి వెలుగు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లోనూ పూర్తి చేసి షెడ్యూల్ పంపిణీ చేయాలని చెప్పారు. రేషన్ షాపుల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంపుల నిర్వహణ తేదీలు ప్రచురించాలని ఆదేశించారు. మండల, జిల్లా, పురపాలక సంఘం సమావేశాలలో కంటి వెలుగుపై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రణాళిక రూపొందించుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు. 1 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్)లు పెట్టుకోవాలని పేర్కొన్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News