Sunday, April 28, 2024

తెలంగాణలో గెలిచి నిలిచేది బిఆర్‌ఎస్ మాత్రమే !

- Advertisement -
- Advertisement -

ప్రచార సరళి నిరూపించింది
ట్విట్టర్‌లో మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గెలిచి నిలిచేది బిఆర్‌ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించిందని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ది బలుపు కాదు వాపేనని విఫలమైన వారి సభలు రుజువు చేశాయని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపిల నుంచి ఎంత మంది పొలిటికల్ టూరిస్టులు వచ్చినా కెసిఆర్‌కే ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.

ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో కెసిఆర్‌పై తెలంగాణ ఏకపక్షంగా తన అభిమానాన్ని చాటుకోబోతోందని చెప్పారు. మూడోసారి బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించి, కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎం చేయాలని తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్దమయ్యారని చెప్పారు. ప్రచారంలో కష్టపడ్డ బిఆర్‌ఎస్ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్ఫూర్తిని చివరివరకు కొనసాగించి బిఆర్‌ఎస్‌కు భారీ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను సాధించి, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిన కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎంగా ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుతున్నాను… జై తెలంగాణ.. జై కెసిఆర్ అంటూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News