Saturday, April 20, 2024

కామన్ విద్యావిధానం కావాలి

- Advertisement -
- Advertisement -

దేశంలో జాతీయ స్థాయిలో ఎన్‌సి ఆర్‌టి, రాష్ట్ర స్థాయి లో ఎస్‌సిఆర్‌టి ఉన్నాయి. విద్యార్థుల స్థాయిని బట్టి, వారి తరగతిని బట్టి సబ్జెక్టు లో అనుభవం కలిగిన, నిష్ణాతులైన వారి చేత పాఠ్య పుస్తకాలను రూపొందించి జాతీయ స్థాయిలో ఎన్‌సిఆర్‌టి, రాష్ట్ర స్థాయిలో ఎస్‌సిఆర్‌టి పుస్తకాలను ఒకటి నుండి 10వ తరగతి వరకు అమలు చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా పాఠశాల స్థాయిలో పుస్తకాలను రూపొందించి తమ స్వీయ ఎజెండా అమ లు చేస్తున్నారు. 10వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నందున అనేక ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలను చదివించకుండా కేవలం ప్రశ్న జవాబులను మాత్రమే చదివిస్తూ విద్యార్థులకు మంచి గ్రేడింగ్ రావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులకు మార్కులు, గ్రేడింగ్ విధానంపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని విద్యా విధానంలో వివిధ మేనేజ్‌మెంట్లు ఉండడం వల్ల విద్యా విధానం గందరగోళంగా మారుతున్నది. దేశ వ్యాప్తంగా కామన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం, ఒకేసారి ఫలితాలు ప్రకటించడం, ఒకేసారి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యా విధానంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఎయిడెడ్, కార్పొరేట్, మైనారిటీస్, మోడల్ స్కూల్, పబ్లిక్ స్కూల్‌లు, నవోదయ స్కూళ్ళు, కేంద్రీయ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఎస్‌సి గురుకులాలు, ఎస్‌టి గురుకులాలు, బిసి గురుకులాలు, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు, స్పోర్ట్ స్కూల్‌లు, మిలిట్రీ స్కూల్, సైనిక్ స్కూల్‌లు, ప్రైవేటు స్కూల్‌లు, (నారాయణ, చైతన్య, రవీంద్ర భారతి వందే మాతరం, బ్రిలియంట్, గీతం, సెయింట్ పీటర్స్, సెయింట్ జోసెఫ్, సెయింట్ ఫ్రాన్సిస్, లిటిల్ ఫ్లవర్, సెయింట్ మేరీ, సెయింట్ లూయిస్ మొదలైనవి) అనేకం ఉన్నాయి.

త్రిభాషా సూత్రం అమలు జరిగేనా?
భారతీయ విద్యా విధానంలో త్రి భాషా సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ప్రథమ భాషగా మాతృ భాష (తెలుగు రాష్ట్రాలలో తెలుగు , ఉర్దూ) ద్వితీయ భాషగా హిందీ, తృతీయ భాషగా ఇంగ్లీష్ అనేక పాఠశాలల్లో త్రి భాషా సూత్రం పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాతృభాష తెలుగును తప్పని సరిచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. 10వ తరగతి వరకు తెలుగును తప్పని సరిగా అభ్యసించాలనే నియమ నిబంధనలు రూపొందించినది. అనేక పాఠశాలల్లో ప్రభుత్వ ఉత్తర్వులను ఏమాత్రం ఖాతరు చేయకుండా 10వ తరగతి వరకు తెలుగు చదవకుండానే పదవ తరగతి పూర్తి చేస్తున్నారు. తెలుగుకు బదులుగా సంస్కృతం, రష్యన్, ఫ్రెంచ్, చైనీస్ మిగతా భాషలను చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతి వరకు తెలుగు భాషను అమలు చేయని పాఠశాలలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉం ది. అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్త ధోరణి, అవినీతి వలన ప్రైవేటు పాఠశాలల్లో ఆడిందే ఆటగా మారింది.

ప్రభుత్వ పుస్తకాలను అమలు చేయడం లేదు
దేశంలో జాతీయ స్థాయిలో ఎన్‌సిఆర్‌టి, రాష్ట్ర స్థాయిలో ఎస్‌సిఆర్‌టి ఉన్నాయి. విద్యార్థుల స్థాయిని బట్టి, వారి తరగతిని బట్టి సబ్జెక్టులో అనుభవం కలిగిన, నిష్ణాతులైన వారి చేత పాఠ్య పుస్తకాలను రూపొందించి జాతీయ స్థాయిలో ఎన్‌సిఆర్‌టి, రాష్ట్ర స్థాయిలో ఎస్‌సిఆర్‌టి పుస్తకాలను ఒకటి నుండి 10వ తరగతి వరకు అమలు చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా పాఠశాల స్థాయిలో పుస్తకాలను రూపొందించి తమ స్వీయ ఎజెండా అమ లు చేస్తున్నారు. 10వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నందున అనేక ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలను చదివించకుండా కేవలం ప్రశ్న జవాబులను మాత్రమే చదివిస్తూ విద్యార్థులకు మంచి గ్రేడింగ్ రావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులకు మార్కులు, గ్రేడింగ్ విధానంపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. విద్యార్థుల మానసిక, భౌతిక విషయాలపై దృష్టిని కేంద్రీకరించడం లేదు. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ తరువాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత జరగనున్న ఐఐటి కోసం 3, 4వ తరగతి నుండే ఐఐటి బోధన పేరిట విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.

ఫీజులపై అజమాయిషీ లేదు
పబ్లిక్ స్కూళ్లలో, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఫీజులను తమకు ఇష్టానుసారం పెంచుకుంటుపోతున్నాయి. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఫీజుల భారం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధిక మొత్తాల్లో ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. విద్య వ్యాపార సంస్థగా మారింది. జాతీయలో, రాష్ట్ర స్థాయిల్లో అధికారులు పిల్లలు, నాయకుల పిల్లలు, పేద, మధ్య తరగతి ప్రజల పిల్లలు చదవడానికి కామన్ విద్యా విధానంను అమలు చేయాలి. జాతీయ స్థాయిలో కేంద్ర కేబినెట్ 2023-24 విద్యా సంవత్సరానికి ఆమోదించిన 1+5+ 3+4 విద్యా విధానం అన్ని పాఠశాలల్లో అమలు అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడం వల్ల అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలకు కొత్త ఊపిరిని పోస్తున్నాయి.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఉపాధ్యాయులను వేరువేరు పేర్లతో పిలుస్తున్నారు. ప్రభుత్వ టీచర్‌లు, ఎయిడెడ్ టీచర్లు, ప్రైవేటు టీచర్‌లు, విద్యా వాలంటీర్లు, కాంట్రాక్టు టీచర్లు, గురుకుల పాఠశాలల టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్‌లు అంటూ వేరువేరు పేర్లతో పిలుస్తున్నారు. ఉపాధ్యాయుల కనీస సమస్యలను పరిష్కరించడం లేదు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, సర్వీస్ నిబంధనలు సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాల్సిన అవసరం వుంది. భాషోపాధ్యాయులుగా ఉద్యోగ నియామకం జరిగి భాషోపాధ్యాయులుగా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో బోధిస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంబంధిత అధికారులు జాతీ య స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కామన్ విద్యా విధానంపై దృష్టిని కేంద్రీకరించి విద్యా వ్యాపారంను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎస్. విజయ భాస్కర్
9290826988

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News