Friday, April 19, 2024

భర్త రోడ్డు ప్రమాదంలో మృతి… ఘటనా స్థలానికి వెళ్తుండగా భార్య

- Advertisement -
- Advertisement -

Couple dead in Road accident at Kamareddy

కామారెడ్డి: భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఘటనా స్థలానికి వెళ్తుండగా భార్య కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లిలో జరిగింది. భర్త సిద్ధయ్య(50) అంతంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య సిద్ధవ్వ(44) తన మరిదితో కలిసి బైక్ పై వెళ్తుండగా ఇద్దరు కిందపడ్డారు.  వెంటనే వారిని అంబులెన్స్ లో కామారెడ్డి పభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిద్ధవ్వ దుర్మరణం చెందింది. దీంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News