Sunday, May 5, 2024

స్మశానాలనూ ముంచెత్తిన వరదనీరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరద నీరు రోడ్లు, పార్కులు, చివరికి స్మశానాలను కూడా ముంచెత్తింది.కింగ్స్‌వే క్యాంప్‌లోని అంధుల పాఠశాలలోకి వరదనీరు చేరడంతో చిక్కుపడిన 60 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయూర్ విహార్‌లో ఓ పశువుల షెల్టర్‌లో చిక్కుపడిన 50 గోవులు, 60 కుక్కలనుఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో కాపాడాయి. వరద నీరు చేరడంతో నిగమ్‌బోధ్ ఘాట్, గీతా కాలనీ, వజీరాబాద్, సరాయికాలేఖాన్ తదితర ప్రాంతాల్లోని స్మశానాలను సైతం మూసివేసినట్లు నగర మేయర్ షెల్లీ ఓబెరాయ్ శుక్రవారం చెప్పారు.మరో వైపు వరద సహాయక చర్యలపై ఆప్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ కార్యాలయం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News