Sunday, April 28, 2024

వర్క్ అండ్ చిల్ విత్ టీమ్

- Advertisement -
- Advertisement -

Director Trivikram met Mahesh babu

 

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడవ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను ప్రకటించింది. దీనిపై చిత్ర బృందం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మహేష్ దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడ మహేష్‌ను దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కలిశారు. సూపర్‌స్టార్‌తో సినిమా కథకు సంబంధించిన చర్చలు జరిగాయని తెలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘వర్క్ అండ్ చిల్ విత్ టీమ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం మహేష్ ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమాలు చేస్తాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News