హైదరాబాద్: పిచ్చికుక్కలు దాడి చేయడంతో 50మంది పాఠశాల విద్యార్థులకు గాయాలైన సంఘటన నగరంలోని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు స్కూల్ ముగియడంతో ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా దాడి చేశాయి. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు ఒకరిపై ఒకరు పడడంతో గుంపులుగా వచ్చిన కుక్కలు వారిపై దాడి చేశాయి.
దీంతో 50మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు విద్యార్థులను ఫీవర్ ఆస్పత్రి, పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. స్థానికులు కుక్కలను వెంబడించి ఒకదానిని చంపివేశారు. వీధుల్లో కుక్కల ఇబ్బందిగా మారాయని, పిల్లలను బయటికి పంపించాలంటేనే భయమేస్తోందని స్థానికులు ఆవేధన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు.
dogs attack on Students at Ameerpet