Saturday, April 20, 2024

టిటిడి ట్రస్టులకు రూ.60 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు చెందిన నితిన్ సాయి ఇండియా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళంగా అందించింది. సంస్థ అధినేత, మాజీ శాసనసభ్యులు శ్రీ జి.సూర్యనారాయణ తరపున ఆయన కుమారుడు శ్రీ నితిన్ సాయి తిరుమలలో డోనార్ సెల్ ఇన్ఛార్జి డెప్యూటీ ఈఓ శ్రీ సెల్వంకు విరాళం డీడీలను అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, బర్డ్, సర్వశ్రేయ, పురాతన ఆలయాల పరిరక్షణ ట్రస్టు‌, కాటేజీ నిర్మాణం కోసం రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, ప్రచారం చేసేందుకు టీటీడీ చేస్తున్న కృషిని దాత కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News