Monday, April 29, 2024

మన్సూర్‌పై చర్యలు తీసుకోవద్దు: త్రిష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవద్దని నటి త్రిష పోలీసులను కోరింది. త్రిషపై అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో త్రిషకు మెగస్టార్ చిరంజీవి, చాలా మంది నటులు, నటి మణులు మద్దతు పలికారు. అలీఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేయాలని తమిళనాడు రాష్ట్ర డిజిపికి ఉత్తర్వులు జారీ చేసింది. థౌజడ్ లైట్ ఆల్ ఉమెన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై త్రిష రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని పోలీసులకు లేఖ పంపారు. మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు చెప్పారని, దీంతో ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News