Saturday, May 4, 2024

సూరారంలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 గ్రాముల క్రిస్టల్ 700 ఎంఎల్ మెత్ ఫెటా మైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అరెస్టయిన నిందితులు కమ్మ శ్రీనివాస్‌రాజు, జి.నరసింహరాజు, డి.నాగరాజు, ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్‌రాజుకు గతంలో డ్రగ్స్ అమ్మడంలో నేరచరిత్ర ఉందని, 2013లో జీడిమెట్ల ప్రాంతంలో మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డాడని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News