Sunday, April 28, 2024

ప్రగతి భవన్‌లోదసరా వేడుకలు

- Advertisement -
- Advertisement -

కుటుంబంతో కలిసి నల్లపోచమ్మ అమ్మవారికి సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు

రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా
ఆశీర్వదించాలని,విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించిన సిఎం కెసిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగ తి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోశ్చారణల నడుమ ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం స తీమణి శోభమ్మ, కుమారుడు, మంత్రి కెటిఆర్, కో డలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు. శుభసూచకంగా భావించే పాలపిట్టను సిఎం దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం దసరానాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని సిఎం కెసిఆర్ పాల్గొన్నారు.

అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సిఎం కెసిఆర్ నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ సిఎం కెసిఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని సిఎం అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం కర్ణాటకలోని శృంగేరీ పీఠం నుంచి తీసుకుని వచ్చిన శారదాదేవి నవరాత్రోత్సవ ప్రసాదాన్ని ముఖ్యమంత్రి దంపతులకు పూజారులు అంచేశారు. కాశ్మీర్‌లోని శారద స్వరజ్జపీఠం దేవాలయ జ్జాపికను తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ రావు సిఎం కెసిఆర్‌కు అందచేశారు.

Pragati Bhavan 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News