Monday, May 19, 2025

భయంతో వణుకుతున్న పాక్‌లో.. అర్థరాత్రి భూకంపం..

- Advertisement -
- Advertisement -

పహల్‌గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా.. భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్థాన్(Pakistan) భయంతో వణికిపోతోంది. ఆపరేషన్‌ సింధూర్‌‌లో భాగంగా భారత్ పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మిసైల్స్‌తో దాడి చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్‌కి ఎలాగైన ప్రతీకారం తీర్పుకోవాలని అనుకుంటున్న పాకిస్థాన్(Pakistan) సరిహద్దుల వెంబడి దాడులు చేస్తోంది. అయితే ఈ పిరికి దాడులను భారత సమర్థవంతంగా తిప్పికొడుతోంది.

ఇప్పటికే భారత్ దెబ్బకి విలవిలలాడుతున్న పాక్‌కి మరో షాక్ తగిలింది. ఈసారి అది ప్రకృతి నుంచి మే 9వ తేదీ అర్థరాత్రి 1.44 గంటలకు భూకంపం(Earthquake) సంభవిచింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్టేల్‌పై భూకంప(Earthquake) తీవ్రత 4.0గా నమోదు అయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగులేదని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News