Friday, March 29, 2024

టర్కీలో భారీ భూకంపం…

- Advertisement -
- Advertisement -

Earthquake

ఇలాజిజ్ ప్రావిన్స్‌: టర్కీలో శుక్రవారం అర్థరాత్రి భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 18మంది చనిపోగా.. దాదాపు 500మందికి పైగా గాయపడ్డారు. తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్‌, సివ్ రిన్ జిల్లాలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ తీవ్రత 6.8గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగెత్తారు. భూకంపం తర్వాత భూ ప్రకంనలు నమోదయ్యాయని టర్కీ విపత్తు శాఖ పేర్కొంది. ప్రస్తుతం శిధిలాల్లో చిక్కికున్న వారిని రక్షించడానికి సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. శిథిలాల కింద 30 మంది వరకు చిక్కికుని ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

Earthquake kills 18 injures 500 in Turkey
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News