Thursday, April 25, 2024

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

Ease of Doing Business

 

హైదరాబాద్ యువతే భారత్‌కు బలం

ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం

హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగాసిఎన్‌బిసి టివి..18, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన ఫ్యానల్ డిస్కషన్లో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఇండియా ఇన్వెస్టెమెంట్ అండ్ అండ్ ఇన్నోవేషన్ నేషన్ అంశంపై నిర్వహించిన ఈ చర్చలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయ న్నారు. 20 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న యువత భారత దేశానికి అద్భుతమైన బలమన్నారు. ఈ చర్చలో భాగంగా తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలు, ఇన్నోవేషన్ రంగం గురించి ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు.

ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ టాప్ 5 దిగ్గజ కంపెనీలకు చెందిన అతి ప్రధాన కార్యాల యాలను ఇప్పటికే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకు న్నాయని తెలిపారు. నివాసం ఉండేందుకు భారత దేశంలోనే హైదరాబాద్ నగరం అత్యుత్తమమైనదని మెర్సర్ (mercer)గత ఐదు సంవత్సరాలుగా గుర్తిస్తూ వస్తోందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. దీంతోపాటు ప్రపంచంలోని 130 నగరాల్లో అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్ ని జెఎల్‌ఎల్ ఇటీవల గుర్తించిందన్నారు. ఇఒడిబితో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గింపు, క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

భారత్ తో పాటు రాష్ట్రాలన్ని మరింత బలోపేతం కావాలంటే ఇన్నోవేషన్, ఇన్ క్లూజివ్ గ్రోత్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటించాలని కెటిఆర్ సూచించారు. ప్యానల్ డిస్కషన్ అనంతరం దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో పలు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలిశారు. రోషే చైర్మన్ క్రిస్టోఫర్ ప్రాన్జ్ కెటిఆర్‌ను కలిసారు. ఈ సమావేశం సందర్భంగా కెటిఆర్ ఆయనకు హైదరాబాద్ నగరం ఫార్మా హబ్ గా ఉన్నదని, ఫార్మాసిటీ మరియు మెడికల్ డివైస్ పార్కుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించా రు.హెచ్‌పిసిఒఒ విశాల్ లాల్, అపోలో టైర్స్ ఉపాధ్యక్షుడు, ఎండి నీరజ్ కన్వర్, కాలల్స్ బెర్గ్ గ్రూప్ చైర్మన్ ప్లెమింగ్ బెసెన్ బాచర్, పి అండ్ జి దక్షిణాసియా సియిఓ, ఎండి మాగెశ్వరన్ సురంజన్‌లతోనూ మంత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశాల సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మరియు లైఫ్ లైసెన్స్ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు.

Ease of Doing Business King Hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News