Friday, April 26, 2024

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడి విచారిస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. మరోవైపు ఈరోజు ఈడి విచారణకు కవిత రెండోసారి హాజరయ్యారు. ఈ స్కామ్ లో నిందితుడు, హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడి అధికారులు విచారించారు. వీరిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి నాలుగు గంటల సేపు ప్రశ్నించినట్టు సమాచారం.

అనంతరం పిళ్లై కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరోవైపు కవితను ప్రస్తుతం ఈడి అధికారులు ఒంటరిగా విచారిస్తున్నారు. ఆమెను ఈడి అధికారులు అదుపులోకి తీసుకుంటారా?… లేక  విచారణ అనంతరం పంపించేస్తారా? అనే విషయంలో స్పష్టత కానరావడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News