Monday, April 29, 2024

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

* కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా నమోదు
* 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాం
* రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పెరిగిందని, అందుకు అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. శనివారం బిఆర్‌కెఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను సిఈఓ వికాస్‌రాజ్ ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 24, 25 తేదీల నుంచి సమ్మరి రివిజన్ ప్రారంభమైందని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈవిఎంలన్నింటినీ చెక్ చేశామని, అధికారుల శిక్షణ కోసం ఈవిఎంలను తెప్పించామని చెప్పారు. వచ్చే నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్టిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించడం. వారికి శిక్షణ ఇవ్వడం, పోలింగ్ స్టేషన్లు పరిశీలించి ఈసిఐ సూచనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా? లేదా వంటివి పరిశీలించి లేకుంటే సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు, కేంద్ర బలగాలకు వసతి, రవాణా సౌకర్యం, వారికి విధుల కేటాయింపు వంటిపై అంశాలపై దృష్టిసారించామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఈవిఎంల ర్యాండమైజేషన్ తదితర ఏర్పాట్లు, శిక్షణ కొనసాగుతున్నాయని తెలిపారు.

అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం
అక్టోబరులో 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని వికాస్‌రాజ్ తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో, సిఎస్, డిజిపి, కలెక్టర్లతో సమావేశమవుతుందని వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని. 3 లక్షల ఓట్లు రద్దయ్యాయని తెలిపారు. ఫారం -6, 8లు 15వేలకు పైగా వచ్చాయన్నారు. ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో వేగం పెరగడంతో షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. తుది ఓటర్ల జాబితా పూర్తయ్యాక జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. బోగస్ ఓట్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల షెడ్యూలను ఎన్నికల సంఘం ఖరారు చేస్తుందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News