Thursday, January 23, 2025

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బేగంపేటలో ఎలక్ట్రిక్ బస్సులో పొగలు, మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మంటలు అంటుకోవడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. డ్రైవర్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. శంషాబాద్ నుంచి జెబిఎస్‌కు వెళ్తుండగా బస్సులో మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News