Monday, April 29, 2024

ప్రపంచాన్ని ఏలుతున్న భారతీయులు: ఎలాన్ మస్క్

- Advertisement -
- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో: భారతీయులు ప్రపంచాన్ని ఏలుతున్నారు అని ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) సిఇఓ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఎక్స్ తన ‘వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఖాతాలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సిఇఓలుగా ఉన్న భారతీయుల జాబితాను షేర్ చేసింది. కొద్ది సేపట్లోనే ఆ జాబితా మస్క్‌తో పాటుగా లక్షలాది మంది దృష్టిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ జాబితాలో భారతీయ సంతతికి చెందిన వారు సిఇఓలుగా ఉనప్దాదాపు 23 పప్రంచ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.

గూగుల్, అల్ఫాబెట్ కంపెనీలకు సిఇఓగా ఉన్న సుందర్ పిచాయ్, మైక్రాన్ టెక్నాలజీ సిఇఓ సంజయ్ మెహ్రోత్రా, అడోబ్ సిఇఓ శంతను నారాయన్, మైక్రోసాఫ్ట్ చైర్మన్, సిఇఓ సత్య నాదెళ్ల లాంటి వాళ్లు ఉన్నారు. ఈ జాబితా అంతటితో ఆగలేదు, ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ, యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్, నెట్‌యాప్ సిఇ జార్జి కురియన్ ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత పొడవున ఈ జాబితా ఉంది. మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఇదే జాబితాకు సంబంధించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో అందరినీ అకట్టుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News