Thursday, April 25, 2024

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సరిగ్గా చదువుకోవడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….బాలానగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి శివప్రసాద్ సరిగ్గా చదవడం లేదు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌కు వచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News