Friday, June 20, 2025

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదం లేకుండా నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కేబినెట్ లో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఒక వేళ నిర్ణయం తీసుకున్న కేబినెట్ ఆమోదం తీసుకుంటారని, తాను బీజేపీ ఎంపీగా కాకుండా నాటి మంత్రిగా చెబుతున్నానని ఎంపీ ఈటెల స్పష్టం చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించిన ఈటెల ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని, ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ సీఎం పక్కనే ఉన్నారని, అవసరమైతే వారిని అడిగితే స్పష్టంగా చెప్తారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా అని ఈటెల ప్రశ్నించారు. ఆధారాలు అన్నీ ఇస్తామని స్పష్టం చేశారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారని, ప్రతి నిర్ణయం క్యాబినెట్ రాటిఫికేషన్ జరుగుతుందనాఇ, కాళేశ్వరం అన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తానని అన్నారు. మీ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా క్యాబినెట్ లో పెట్టండి అని కెసిఆర్ చెప్పే వారని, ఇది నిజం కాదంటే తాను దేనికైనా సిద్ధమని ఈటెల సవాల్ విసిరారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలని, ప్రాజెక్ట్ నిర్మించాలి కానీ వాటిని అడ్డం పెట్టుకుని సంపాదించడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిందని, తాను జైళ్లకు పోయిన, రక్తం చిందించి పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది. ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా ? అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదని, జలయజ్ఞంలో ప్రాణహిత చేవెళ్ల 5 ఏళ్లలో పూర్తి చేసే ప్రాజెక్ట్ కదా ? ఎందుకు చేయలేదని నిలదీశారు.

కమిషన్ త్వరగా పూర్తి చేసి అవినీతి నిగ్గు తేల్చాలని, బీజేపీ అయితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుందన్నారు. బిజెపి ప్రాజెక్టులు కట్టడానికి వ్యతిరేకం కాదని, అధికారం అడ్డం పెట్టుకుని టెండర్ లేకుండా పనులు పంచుకోవడం తప్పు అని, ఎటిఎంగా మార్చుకున్న కల్చర్ ను తప్పు పడుతున్నామని స్పష్టం చేశారు. దమ్ముంటే రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాలని, కుంగి పిల్లర్లు రిపేరు చేసి నీళ్లు ఇవ్వాలని, అవినీతి చేసిన వారిని వదలపెట్టవద్దన్నారు. బనకచర్లలో కూడా తననుబంధనం చేయాలని చూస్తున్నారని, పోతిరెడ్డిపాడు పేరుతో అన్యాయంగా మన నీళ్లను తీసుకుని పోతుంటే దుర్మార్గం అని చెప్పి పులిబిడ్డలా కొట్లాడింది తానేనని, రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి జెండాకు ఎక్కింది నేను…అవి ఎక్కడికీ పోవు..ఇప్పుడు బదనం చేయాలని చూస్తే ప్రజలు నమ్మరని ఈటెల స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News