ముంబై: న్యూజిలాండ్తో జరిగే ట్వంటీ20 సిరీస్ నుంచి వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ను తప్పించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా జట్టుకు ఎంపిక అవుతున్నా శాంసన్కు తుది జట్టులో చోటు దక్కలేదని వారు విమర్శిస్తున్నారు. ఇక, లంకతో జరిగిన టి20 మ్యాచ్లో ఎట్టకేలకు శాంసన్కు తుది జట్టులో ఛాన్స్ దొరికింది. అయితే ఆ మ్యాచ్లో రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఔటయ్యాడు. దీంతో శాంసన్ను కివీస్ సిరీస్ నుంచి ఉద్వాసన పలికారు. ఇక, శాంసన్ను తొలగించడంపై అతని అభిమానులు సెలెక్టర్లపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. జట్టు ఎంపికలో సెలెక్టర్ల తీరును వారు తప్పుపడుతున్నారు. ఒక మ్యాచ్లో మాత్రమే అవకాశం కల్పించి జట్టు నుంచి తొలగించడం అన్యాయమని వారు వాపోతున్నారు. ధావన్, రిషబ్ పంత్, రాహుల్లకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన సెలెక్టర్లు శాంసన్పై మాత్రం చిన్నచూపు చూడడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.