Sunday, April 28, 2024

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : విద్యుత్ ఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామ ంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై బల రాం తెలిపిన వివరాల ప్రకారం… మంగళపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడ్ల కృష్ణయ్య రోజు మాదిరిగానే తన వ్యవసాయ పోలంలోని పంటకు నీళ్లు పెట్టడానికి స్టాటర్‌ను ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందినట్లు తెలిపారు. పోలాల రైతులు గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News