Sunday, April 28, 2024

రైతుల ఛలో ఢిల్లీ: ముళ్ళ కంచెలతో రహదారులు మూసివేత

- Advertisement -
- Advertisement -

రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు.. రహదారులను ముళ్ళ కంచెలతో మూసివేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై భారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ‘ఢిల్లీ చలో ’ మార్చ్ నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేత, తదితర డిమాండ్లతో ఛలో పార్లమెంట్ కు రైతు సంఘాలు పిలుపు నిచ్చాయి.

ఈ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటివి కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. దీంతో అప్రమత్తమైన హర్యానా, ఢిల్లీ పోలీస్‌లు అత్యవసరమైతేనే తప్ప రహదారుల పైకి ప్రజలు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అంబాల, సోనిపట్, పంచకుల్‌లో సెక్షన్ 144ను విధించారు. అలాగే అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింధ్, హిస్సార్, ఫతేహబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. పంజాబ్, హర్యానా, నుంచి రైతులు ఢిల్లీ నగరం లోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను సిద్ధం చేశారు. రైతులు నగరం లోకి రావాలని ప్రయత్నిస్తే క్రేన్లు, కంటైనర్లుతో సరిహద్దులను మూసివేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News