- Advertisement -
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్విట్ చేశారు. సోమవారం బాగ్పట్లో ఓ ఇనుము వ్యాపారిని కొందరు అపహరించి రూ.కోటి డిమాండ్ చేసిన వార్తను ప్రియాంక ఉటంకించారు. యుపిలో వ్యాపారులు, మహిళలు, చిన్నారులు, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. శాంతి, భద్రతలను కాపాడటంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు ఎన్నికల ప్రచారంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, దాంతో ప్రజల్లో భయం నెలకొన్నదని ఆమె తెలిపారు.
- Advertisement -