Saturday, July 27, 2024

జార్ఖండ్ ఎన్‌టిపిసిలో మంటలు

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్‌లో ఎన్‌పిటిసికి చెందిన నార్త్ కరన్‌పురా విద్యుత్ కేంద్రంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఛత్రా జిల్లాలో ఈ భారీ స్థాయి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. మధ్యాహ్నం పూట అగ్ని ప్రమాదం జరిగిందని, ప్రాణనష్టం ఏదీ జరగలేదని అధికారులు తెలిపారు. యూనిట్ వెనుక ఉండే భెల్ మెటీరియల్ యార్డ్‌లో తొలుత ప్రమాదం జరిగింది. కారణాలు తెలియలేదని అధికారులు చెప్పారు. ఇక్కడి ఎన్‌టిపిసి విద్యుత్ కేంద్రం బొగ్గు ఆధారితంగా పనిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News