Friday, April 26, 2024

సికింద్రాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out at Secunderabad GHMC Office

హైదరాబాద్: సికింద్రాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిహెచ్ఎంసి కార్యాలయంలోని మూడో అంతస్తులో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ అలుముకోవడంతో కార్యాలయ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం మేరకు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fire breaks out at Secunderabad GHMC Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News