Thursday, March 28, 2024

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తుల నుండి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా హుజూర్నగర్, గరిడేపల్లి, నడిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగినదని తెలిపారు.

గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం పై జిల్లా వ్యాప్తంగా వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తుండగా హుజూర్ నగర్ మీదుగా అనుమానంగా వెళుతున్న ఉన్న కారును తనిఖీ చేసి 20 kg ల గంజాయిని హుజూర్ నగర్ సి. ఐ అధ్వర్యంలో స్వాధీనం చేసుకోవడం జరిగినదని, అలాగే గరిడేపపల్లిలో నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తి వద్ద ఒక కేజీ గంజాయి సీజ్ చేయడం జరిగినదనీ ,బస్సులో అనుమానంగా ప్రయాణిస్తున్న ఇద్దరినీ నడిగుడెం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుండి 1.5 కేజీ ల గంజాయి సీజ్ చేయడం జరిగినదనీ తెలిపారు.

అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. వీరి నుండి సుమారుగా 5 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నరు. హైదరాబాద్ కు చెందిన ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్, రోహన్ రాజ్ ఫుట్ కాలు తివారి నలుగురు కలిసి జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారనీ వివరించారు.

ఈ నెల 5న జూమ్ లో క్యాబ్ బుక్ చేసుకొని 20కేజీల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ తరలించాల్సి ఉండగా పోలీసుల చెకింగ్ లకు భయపడి నాలుగు రోజుల పాటు అరకులో లాడ్జి తీసుకొని ఉండి ఈ నెల 9న కొనుగోలు చేసిన గంజాయిని తీసుకొని హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా రోహన్ రాజ్ ఫుట్, కాలు తివారీ బస్సులో హైదరాబాద్ చేరుకోగా గంజాయిని తీసుకొని హుజుర్ నగర్ మీదిగా హైదరాబాద్ వెళ్తున్న ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్ పోలీసులు చెకింగ్ చేస్తుండడంతో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డారని తెలిపారు వీరి నుండి కారు, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామనీ తెలిపారు.

నడిగుడెం పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసులో ఏపీ కి చెందిన విజయ్ కుమార్, బంగారు రాజు హైదరాబాద్ లో హాస్టళ్లలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారనీ. స్నేహితులతో కలిసి గంజాయి తాగే అలవాటు ఉండగా జీతాలు సరిపోక పోవడంతో వైజాగ్ నుండి మూడు నెలలకు ఒకసారి తక్కువ ధరకు గంజాయ్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకొంటూ జల్సాలను తీర్చుకొనేందుకు గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని వెల్లడించారు.ఈ క్రమంలో 1.50కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ వస్తుండగా నడిగూడెం వద్ద పోలీసుల తనిఖీ లలో పట్టుబడ్డారనీ తెలిపారు. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ చెందిన కేసులో నల్లగొండ జిల్లా గుర్రం పొడు మండలం బొల్లారం గ్రామనికి చెందిన పురం గణేష్ పారా మెడికల్ చదువు మధ్యలోనే ఆపేసి కూలి పనులు చేస్తూ గంజాయికీ అలవాటు పడ్డాడనీ, దాచేపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 800గ్రామాల గంజాయిని కొనుగోలు చేసి గరిడే పల్లి లో తిరుగుతుండగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారనీ తెలిపారు.

గంజాయి కి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అంధించి యువతను గంజాయి బారి నుండి కాపాడాలని ఎస్పీ సూచించారు కేసులో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందించారు. ఈ సమావేశంలో కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర్లు, మునగాల సిఐ ఆంజనేయులు, హుజుర్ నగర్ సిఐ రామలింగారెడ్డి, ఎస్సైలు ఏడుకొండలు, వెంకట్ రెడ్డి, కొండల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News